గెట్ టు గెదర్ లో విషాదం.. బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

గెట్ టు గెదర్ లో విషాదం.. బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

      నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం జువ్విగూడెంలో ఘటన

నార్కట్​పల్లి, వెలుగు: నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలం జువ్విగూడెంలోని ఓ ఫామ్​హౌస్​లో జరిగిన గెట్​ టు గెదర్​లో ఇద్దరు యువకులు చనిపోవడం విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి.. చిన్నప్పటి నుంచి ఒకే చోట చదువుకున్న నకిరేకల్, నార్కట్ పల్లి, చౌటుప్పల్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు రెండేండ్ల కింద నార్కట్ పల్లి శివారులోని శ్రీ విద్యాపీఠ్ పాఠశాలలో టెన్త్​ పూర్తి చేసుకున్నారు. ఓసారి కలుసుకుందామని నిర్ణయించుకొని జువ్విగూడెంలోని ఓ ఫామ్​హౌస్​లో 13 మంది విద్యార్థులు గెట్  టు గెదర్  ఏర్పాటు చేసుకున్నారు.

 సాయంత్రం వరకు ఎంజాయ్​ చేశారు. సాయంత్రం ఫామ్​హౌస్​లో ఉన్న ఓ బావి నీటిలో నార్కట్ పల్లికి చెందిన నల్లగొండ రిషిక్(17), చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన పోలోజు హర్షవర్ధన్(17)  మునిగిపోయారు. షాక్​కు గురైన తోటి స్నేహితులు అరవడం మొదలుపెట్టారు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచరం ఇచ్చారు. ఘటనా స్థలానికి ఎస్సై క్రాంతి కుమార్​ సిబ్బందితో చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో విద్యార్థుల డెడ్​బాడీలను బయటకు తీయించారు. పార్టీ చేసుకునేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.