
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఈ ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ, డెట్ ద్వారా రూ. 6,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. బ్యాంకు బోర్డు బుధవారం నిధుల సేకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ నిధులను ఫాలో- ఆన్ పబ్లిక్ ఆఫర్, రైట్స్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్మెంట్లు లేదా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ వంటి మార్గాల ద్వారా సేకరిస్తారు.
ఇందుకోసం ప్రభుత్వ అనుమతులు, ఇతర రెగ్యులేటరీ ఆమోదాలు, వాటాదారుల అనుమతులు అవసరం. బ్యాంకులు తమ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి, వృద్ధికి నిధులు సమకూర్చకోవడానికి, నియంత్రణ అవసరాలను తీర్చడానికి మూలధనాన్ని పెంచుకుంటాయి. ఈ నిధులు నష్టాల నుంచి రక్షణ కల్పిస్తాయి. తద్వారా బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇవ్వడానికి, తమ కార్యకలాపాలను విస్తరించడానికి వీలవుతుంది.