మహమ్మారి కారణంగా వ్యాపార సంస్థలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ భారత్ లో అతిపెద్ద బీ2బీ ఈ–కామర్స్ వేదిక ఉడాన్పై మాత్రం వ్యాపార సంస్థలు అత్యుత్తమంగా లావాదేవీలను జరిపాయి. 2020లో ఒక్క లైఫ్స్టైల్ విభాగంలోనే 250 మంది అమ్మకపు దారులు దాదాపు కోటి రూపాయల విలువైన అమ్మకాలు జరిపారు. భారతదేశంలో ఉన్న లైఫ్స్టైల్ రిటైలర్లలో 20% మందికి బట్టలు, యాక్ససరీలు, ఫుట్వేర్ వంటి 230 మిలియన్ ఉత్పత్తులను వీరు సరఫరా చేశారు. లైఫ్స్టైల్ విభాగంలో నమోదైన వృద్ధికి నాణ్యతతో పాటుగా ఆకర్షణీయమైన ధరలు కూడా ఓ కారణమేనని లైఫ్స్టైల్ బిజినెస్ హెడ్ కుమార్ సౌరభ్ అన్నారు.