
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్లో చేరానని జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు ఊదరి గోపాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగ, కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చి దళితులకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
98 శాతం దళితులు ఉన్న జీహెచ్ఎంసీలో, వారికి మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్లో చేరానని వెల్లడించారు. కార్మికుల హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.