EU నుంచి అధికారికంగా విడిపోయిన UK

EU నుంచి అధికారికంగా విడిపోయిన UK

యూరోపియన్ యూనియన్ (EU) నుంచి విడిపోవాలన్న బ్రిటన్ ప్రజల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున(శనివారం) 4:30 నుంచి బ్రిటన్‌లో బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా యూరోపియన్ యూనియన్‌తో ఉన్న 47 ఏళ్ల బంధానికి ఫుల్‌స్టాప్ పడింది. EU నుంచి బయటకు వచ్చిన బ్రిటన్ ఇక నుంచి ప్రపంచ దేశాలతో సరికొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి స్వేచ్ఛ ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లభిస్తుంది.
ఈయూతో విడిపోవాలన్న బ్రిటన్ ప్రజల కోరికతో మూడున్నరేళ్ల క్రితం దేశంలో రెఫరెండం నిర్వహించారు. ఇందులో 52శాతం మంది ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఎన్నో అవాంతరాల మధ్య ఇన్నాళ్లకు అది చట్టంగా మారింది. ఇవాళ్టి నుంచి బ్రిటన్‌లో కొత్త అధ్యాయం ప్రారంభం కావడంపై ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు.