ఉక్రెయిన్ నుంచి బయల్దేరిన మరో రెండు ఫ్లైట్స్

ఉక్రెయిన్ నుంచి బయల్దేరిన మరో రెండు ఫ్లైట్స్

ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపును వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.  లేటెస్ట్ గా 182 మంది విద్యార్థులతో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఏడో విమానం ముంబైకి చేరుకుంది.కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఎయిర్ పోర్ట్ లో విద్యార్థులను పరామర్శించారు. ఇదిలావుండగా..  216 మంది భారతీయ పౌరులతో కూడిన ఎనిమిదో విమానం హంగేరీలోని బుడాపెస్ట్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరగా, తొమ్మిదవ విమానం 218 మంది భారతీయులను ఎక్కించుకుని బుకారెస్ట్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్  తెలిపారు. ఇప్పటి వరకు 7  విమానాల్లో 1,578 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి భారత్ కు తీసుకొచ్చారు

 

 

మరిన్ని వార్తల కోసం:

అవన్నీ రూమర్స్.. నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది

నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం

నాలుగు రోజులుగా బంకర్ లోనే..