మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఉమామహేశ్వరరావు

మూడు రోజుల పోలీస్ కస్టడీకి ఉమామహేశ్వరరావు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయినసిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావును మూడు రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. రేపటి నుంచి అంటే మే 28వ తేదీ నుంచి  మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు అధికారులు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు ఉమా మహేశ్వరరావు.   కస్టడీలో మరికొంత మంది అవినీతి అధికారుల పేర్లు, అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెడే అవకాశం ఉంది. 

సీసీఎస్‌‌‌‌‌‌‌‌లో హైప్రొఫైల్ కేసులనే ఉమామహేశ్వర్ రావు టీమ్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసినట్లు తెలిసింది. ఇందులో చాలా కేసుల్లో సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేసేందుకే ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ప్రయత్నించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కొంత మంది పోలీస్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఉమామహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అవినీతికి సహకరించినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.