
నాగ్ పూర్: క్రికెట్ మ్యాచ్ లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు ఒక్కోసారి గెలవాల్సిన మ్యాచ్ లు ఓడిపోతుంటాయి. ఇలాంటి సంఘటనలపై సోషల్ మీడియాలో విమర్శలు కామన్. ఇప్పుడు ఓ అంపైర్ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అయితే అంపైర్ చేసినదాంట్లో తప్పేమీలేదు. కాకపోతే బ్యాట్స్ మన్ ఔట్ అయిన చాలాసేపటికి వేలెత్తుతూ ఓట్ గా చెప్పాడు. ఇరానీ కప్ లో భాగంగా గురువారం జరిగిన రెస్టాఫ్ ఇండియా-విదర్భ టెస్ట్ మ్యాచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. విదర్భ ఫస్ట్ ఇన్నింగ్స్ లో భాగంగా కెప్టెన్ ఫయాజ్ ఫజల్ అంపైర్ తప్పిద నిర్ణయానికి బలయ్యాడు.
ఇన్నింగ్స్ 21వ ఓవర్ వేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన బాల్ ని ఫజల్ ఫయాన్స్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఆఫ్ స్టంప్ కి వెలుపలగా పడిన బాల్ బ్యాట్ కి అందకుండా డైరెక్ట్ గా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో.. ఔట్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫస్ట్ ఆ ఆప్పీల్ ను ఫీల్డ్ అంపైర్ నందన్ తిరస్కరించాడు. దీంతో ప్లేయర్లు తమ స్థానాలకు వెళుతుండగా నందన్ మరో ఫీల్డ్ అంపైర్ వైపు చూసి.. ఔటంటూ వేలెత్తాడు. దీంతో.. ఫస్ట్ నాటౌట్ అని నిరాశకి గురైన రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లేయర్లు సంబరాలు మొదలెట్టగా.. నాటౌట్ అని సంతోషించిన ఫజల్ కోపంతో కాసేపు క్రీజులోనే ఉండిపోయి, తర్వాత భారంగా క్రీజు వదిలాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంపైర్ తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు బ్యాట్ టచ్ కాకుండానే ఎలా ఔట్ ఇస్తాడంటున్నారు ‘ అంపైర్ నిద్రపోయావా ఏంటి’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి అంపైర్ ని చూడలేదంటూ జోక్స్ వేసుకుంటున్నారు.
— Dhoni Fan (@WastingBalls) February 13, 2019