బాయ్ ​ఫ్రెండ్​ మృతి తట్టుకోలేక యువతి సూసైడ్

బాయ్ ​ఫ్రెండ్​ మృతి తట్టుకోలేక యువతి సూసైడ్

గచ్చిబౌలి, వెలుగు : ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గచ్చిబౌలి ఎస్ఐ రాజశేఖర్​రెడ్డి తెలిపిన ప్రకారం.. పంజాబ్​లోని అమృత్​సర్​ చోగావాన్​ ప్రాంతానికి చెందిన నేహ(19), తొమ్మిది నెలల కిందట సిటీకి వచ్చి గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేట్​హాస్టల్​లో ఉంటూ నానక్​రాంగూడలోని గోల్ఫ్​ఎడ్జ్​లోని బారిష్టా బేకరీలో సేల్స్​గర్ల్​గా జాబ్ చేస్తున్నది. ఇదే బేకరీలో బాలాపూర్​ పరిధి వెంకటాపురం ప్రాంతానికి చెందిన సల్మాన్​ కూడా జాబ్ చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమకు దారి తీసింది. ఇది సంస్థ యాజమాన్యానికి తెలియడంతో సల్మాన్​ను జాబ్ నుంచి తొలగించారు.

ప్రేమికులు పెండ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. తన ప్రేమ విషయం సల్మాన్​ ఇంట్లో చెప్పగా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో  తీవ్ర మనస్తాపంతో అతడు ఈనెల1న ఇంట్లోని తన గదిలో ఉరేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి డిప్రెషన్ లోకి వెళ్లిన నేహ.. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో హాస్టల్​లోని తన ఫ్రెండ్స్ డ్యూటీకి వెళ్లాక రూమ్ లోపలి నుంచి లాక్​ చేసుకొని ఫ్యాన్​కు ఉరేసుకుంది. రూం క్లీన్​ చేసేందుకు హాస్టల్​ సిబ్బంది ఎంత సేపు డోర్ కొట్టినా తీయకపోవడంతో మరో లాక్ తో డోర్​ ఓపెన్​ చేసి చూడగా..  నేహ చనిపోయి కనిపించింది.​ వెంటనే హాస్టల్​ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. నేహ సోదరి మేఘా ఇచ్చిన కంప్లైంట్​ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.