వాగులోంచి అంతిమయాత్ర..

వాగులోంచి అంతిమయాత్ర..

వైకుంఠధామానికి దారిలేక
ఇబ్బంది పడుతున్న ప్రజలు

జనగామ, వెలుగు: వాగు అవతల వైకుంఠధామం కట్టడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. జనగామ జిల్లా లింగాలఘన్​పూర్ ​మండలం కిష్టగూడెం గ్రామానికి చెందిన శాగ భిక్షపతి బుధవారం మృతిచెందాడు. ఇతని అంతిమ సంస్కారాలకు ఊరి శివారు వాగు అవతల ఉన్న వైకుంఠధామంలో ఏర్పాట్లు చేశారు. మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు వాగులో వరద నీరు జోరుగా ప్రవహిస్తోంది. అయినా తప్పని పరిస్థితుల్లో భయం భయంగా వాగు దాటివెళ్లి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. వద్దని చెప్పినా వినకుండా ఆఫీసర్లు వాగు అవతల వైకుంఠధామం నిర్మాణం చేపట్టారని సర్పంచ్​ లోనే భవానీరాంబాబు చెప్పారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం ఎమ్మెల్యే రాజయ్య, కలెక్టర్​ నిఖిల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టి కాటి కష్టాలు తీర్చాలని కోరారు.