
బాధితులను పరామర్శించిన ఎంపీ
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఫంక్షన్ హాళ్లను సీజ్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి సూచించారు. ఆదివారం హైదరాబాద్ అంబర్పేటలోని పెరల్ గార్డెన్ గోడ కూలి మృతి చెందిన విజయలక్ష్మి మృతదేహానికి సోమవారం ఆయన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్లో అనేక హాళ్లకు పార్కింగ్, ఫైర్ సేఫ్టీ వంటివి లేవని, లైసెన్స్ లేని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.