పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. బడ్జెట్ 2022కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పార్లమెంట్లో జరుగుతున్న సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాసేపట్లో సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలమ్మ వరుసగా నాలుగో ఏడాది బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇలా వరుసగా నాలుగేళ్లు పార్లమెంట్లో పద్దు ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ రికార్డ్ క్రియేట్ చేశారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1970లో తానే ప్రధానిగా, తానే ఆర్థిక మంత్రిగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహిళ మన నిర్మలమ్మే. ఇప్పడు ఆమె వరుసగా నాలుగోసారి బడ్జెట్ పెడుతూ ఎవరికీ అందని ఘనతను సొంతం చేసుకున్నారు.
Union Cabinet approves the #Budget2022; the meeting underway at the Parliament has now concluded. Union Finance Minister Nirmala Sitharaman will present the Budget shortly. pic.twitter.com/jpHptTfhz0
— ANI (@ANI) February 1, 2022