కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్కు చేరుకున్నారు.అమర జవాన్లకు నివాళులర్పించిన అమిత్ షా.. చనిపోయిన జవాన్ల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తర్వాత చత్తీస్ గఢ్ లో సుక్మా-బీజాపూర్ సరిహద్దులో జవాన్లపై నక్సల్స్ అటాక్ చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు అమిత్ షా. గాయపడిన జవాన్లను హాస్పిటల్ లో పరామర్శించనున్నారు.