రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు చెప్పారు. బుధవారం ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సోదర, సోదరీమణులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ఉగాది అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు అమిత్ షా. ఈ నూతన సంవత్సరంలో మనమంతా ఇంట్లోనే ఉండి సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా కరోనా మహమ్మారిని ఓడించడానికి ఒక సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.
ఉగాది నాడు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణాలోని నా సోదర మరియు సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ నూతన సంవత్సరంలో మనమందరం ఇంటిలోనే ఉండి సామాజిక దూరాన్ని పాటించి COVID-19 ను ఓడించడానికి ఒక సంకల్పం తీసుకుందాం.
ఈ ఉగాది మీ అందరికీ మంచి ఆరోగ్యం మరియు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
— Amit Shah (@AmitShah) March 25, 2020
అలాగే ఇవాళ ఉగాది జరుపుకొంటున్న కర్ణాటక ప్రజలకు కూడా కన్నడలో శుభాకాంక్షలు చెప్పారు అమిత్ షా. ఇక మణిపూర్ లో ఉగాదిని సజిబు చైరావ్బా అనే పేరుతో జరుపుకుంటారు. ఆ రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారాయన.
My sister and brothers of Manipur are celebrating Sajibu Cheiraoba today, I extend my warm wishes on this occasion. May this festival bring good health, prosperity and joy for all.
— Amit Shah (@AmitShah) March 25, 2020
ಕರ್ನಾಟಕದ ನನ್ನ ಸಹೋದರ, ಸಹೋದರಿಯರಿಗೆ ಹೊಸ ವರ್ಷ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು.
ಈ ಹೊಸ ವರ್ಷದಂದು, ಮನೆಯಲ್ಲೇ ಇರುವುದರ ಮೂಲಕ ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ಅಂತರವನ್ನು ಅನುಸರಿಸುವುದರೊಂದಿಗೆ ಕೋವಿಡ್-19 ಮಹಾಮಾರಿಯನ್ನು ತೊಲಗಿಸುವ ಸಂಕಲ್ಪವನ್ನು ಮಾಡೋಣ.
ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಉತ್ತಮ ಆರೋಗ್ಯ ಮತ್ತು ಸಂತೋಷ ಲಭಿಸಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇನೆ.
— Amit Shah (@AmitShah) March 25, 2020