అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా

అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 15 న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో CAA  కు మద్దతుగా బీజేపీ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ ను వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. సభను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు లక్ష్మణ్.

సభను కేవలం వాయిదా మాత్రమే వేశామని, రద్దు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడం, ఆ తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్స్ ఉండడం, ఢిల్లీ అల్లర్ల ఘటనలపై దర్యాప్తు…. వీటన్నింటి దృష్ట్యా అమిత్ షా బిజీగా ఉన్నందున సభ వాయిదా పడినట్లు లక్ష్మణ్ చెప్పారు. బుధవారం ఉదయం కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి లక్ష్మణ్ కు ఈ విషయంపై ఫోన్ రావడంతో ఆయన బహిరంగ సభ వాయిదా పడినట్టు ప్రకటించారు.

Union Home Minister Amit Shah has postponed his visit to Hyderabad says k.laxman