మావోయిస్టులు ఆయుధాలు వదిలితేనే చర్చలు: అమిత్ షా

మావోయిస్టులు ఆయుధాలు వదిలితేనే చర్చలు: అమిత్ షా

దేశంలోని నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు అమిత్​షా. 2026 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామన్నారు. సరెండర్​ అవండి లేదంటే.. అంతమే అని హెచ్చరించారు. ఆదివాసీల పేరుతో మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. నక్సలైట్లకు తెలంగాణ అడ్డా కాబోదన్నారు అమిత్​ షా. 

నక్సలైట్లతో కాంగ్రెస్​ ప్రభుత్వం చర్చలు జరిపింది. మేం కాంగ్రెస్​ మాదిరి కాదు..ఆయుధాలు వదిలితేనే చర్చలు జరుపుతామన్నారు. ఆయుధాలు పట్టుకున్నోళ్లతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు ఉండవని అన్నారు కేంద్ర మంత్రి అమిత్​ షా. 

దశాబ్దాలుగా ఆదివాసీలను అభివృద్దిని మావోయిస్టులను అడ్డుకుంటున్నారని అమిత్​ షా అన్నారు. 2026 నాటికి మావోయిస్టు ముక్త్​ భారత్​ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన అమిత్​ షా నిజామాబాద్ సభలో మరోసారి స్పష్టం చేశారు. 

బీఆర్​ఎస్, కాంగ్రెస్​పార్టీలపై విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి అమిత్​ షా.. గత బీఆర్​ ఎస్​ ప్రభుత్వంలో అంతా అవినీతే జరిగిందన్నారు. ధరణి, కాళేశ్వరంతో కేసీఆర్​ కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు అమిత్​ షా. రేవంత్​ రెడ్డి సర్కార్​ కూడా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. 

►ALSO READ | కాసేపట్లో నిన్ను లేపేస్తాం..ఎంపీ రఘునందన్ కు మరోసారి బెదిరింపు