
దేశంలోని నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు అమిత్షా. 2026 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామన్నారు. సరెండర్ అవండి లేదంటే.. అంతమే అని హెచ్చరించారు. ఆదివాసీల పేరుతో మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. నక్సలైట్లకు తెలంగాణ అడ్డా కాబోదన్నారు అమిత్ షా.
నక్సలైట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపింది. మేం కాంగ్రెస్ మాదిరి కాదు..ఆయుధాలు వదిలితేనే చర్చలు జరుపుతామన్నారు. ఆయుధాలు పట్టుకున్నోళ్లతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు ఉండవని అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.
దశాబ్దాలుగా ఆదివాసీలను అభివృద్దిని మావోయిస్టులను అడ్డుకుంటున్నారని అమిత్ షా అన్నారు. 2026 నాటికి మావోయిస్టు ముక్త్ భారత్ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన అమిత్ షా నిజామాబాద్ సభలో మరోసారి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలపై విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి అమిత్ షా.. గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో అంతా అవినీతే జరిగిందన్నారు. ధరణి, కాళేశ్వరంతో కేసీఆర్ కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు అమిత్ షా. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
►ALSO READ | కాసేపట్లో నిన్ను లేపేస్తాం..ఎంపీ రఘునందన్ కు మరోసారి బెదిరింపు