హైదరాబాద్:వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దేశం కోసం జరిగే ఎన్నికలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బాగ్ అంబర్పేట డివిజన్లో ఇవాళ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీకి ఎంత మెజారిటీ వస్తదో నిర్దేశించే ఎన్నికలంటూ వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమికి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని మెజారిటీని ప్రజలు మోదీకి కట్టబెట్టపోతున్నారు.
దేశంలో శాంతి భద్రతలు కాపాడటం, సుస్థిరమైన ప్రభుత్వం కోసం మోడీ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. దేశ గౌరవాన్ని పెంచడవ, పేదలకు సంక్షేమం పథకాలు, మౌలిక వసతుల కోసం మోడీనే గెలిపించాలని కోరారు. ప్రపంచ దేశాల ముందు దేశ గౌరవాన్ని పెంచిన వ్యక్తి నరేంద్రమోడీ అని కొనియాడారు. రాష్ట్రంలో 17 సీట్లు గెలిపిం మోడీ ప్రభుత్వంలో భాగస్వామ్యులు చేయాలని ఆయన కోరారు.