అంబేద్కర్ స్పూర్తితో ముందుకు పోతాం: కిషన్ రెడ్డి

అంబేద్కర్ స్పూర్తితో ముందుకు పోతాం: కిషన్ రెడ్డి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మహాత్మగాంధీ, అంబేద్కర్ స్పూర్తితో ముందుకు పోతామన్నారు. ఉగ్రవాదుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి.. కాచిగూడ విఠల్ వాడాలో పాదయాత్ర చేశారు. తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ.. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇండ్లు, రోడ్లు, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.