అగ్నిపథ్ నిరసనలపై స్పందించిన కేంద్ర మంత్రి

అగ్నిపథ్ నిరసనలపై స్పందించిన  కేంద్ర మంత్రి

అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ  దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ పథకం వల్ల నష్టపోతామంటూ..నిరుద్యోగులు అన్ని రాష్ట్రాల్లో నిరసనలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనపై  కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.  హింసాత్మక నిరసనలకు పాల్పవద్దని యువతను కోరారు. రైల్వేలు దేశ ఆస్తి అని అన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలగించవద్దని  విజ్ఞప్తి చేశారు.