
సిడ్నీ: ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే ప్రయత్నాల్లో భాగంగా 2024లో జరిగే టీ20 వరల్డ్కప్ను యూఎస్ఏలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. 2028 లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చేందుకు ఐసీసీ బిడ్ వేయనుంది. దీనికి లాండ్ప్యాడ్గా అదే అమెరికా గడ్డపై నాలుగేళ్ల ముందు టీ20 మెగా ఈవెంట్ను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని చూస్తోంది. టోర్నీ ఆతిథ్యం కోసం యూఎస్ఏ క్రికెట్, క్రికెట్ వెస్టిండీస్ వేసే బిడ్కు అంగీకారం తెలిపేందుకు రెడీ అవుతోందని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ న్యూస్ పేసర్ పేర్కొంది. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే బంగ్లాదేశ్లో జరిగిన 2014 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కాకుండా మరో దేశానికి ఐసీసీ మెగా ఈవెంట్ ఆతిథ్యం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడిప్పుడే క్రికెట్ను ప్రోత్సహిస్తున్న దేశాలకు మెగా ఈవెంట్స్ రైట్స్ ఇవ్వాలని ఐసీసీ చాలా కాలం నుంచి భావిస్తోంది.