‘హైదరాబాద్ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేస్తం’

‘హైదరాబాద్ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేస్తం’

హైదరాబాద్, వెలుగు: యూఎస్ ఆధారిత అన్‌‌‌‌‌‌‌‌రావెల్ డేటా వచ్చే ఏడాదిలో హైదరాబాద్ ఆఫీసులో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని భావిస్తోంది.  వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ఇక్కడి కార్యకలాపాలను పెంచుతామని తెలిపింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తన ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ డేటా యాప్స్​ అబ్జర్బిలిటీ కాన్ఫరెన్స్​ను నిర్వహించిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించింది.  

ఈ సందర్భంగా అన్‌‌‌‌‌‌‌‌రావెల్ కో-ఫౌండర్  శివనాథ్ బాబు మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కస్టమర్లు చాలా మంది తమ వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ డేటా టీమ్‌‌‌‌‌‌‌‌లపై ఆధారపడుతున్నారు. అందుకే హైదరాబాద్ అన్‌‌‌‌‌‌‌‌రావెల్‌‌‌‌‌‌‌‌కు ఒక వ్యూహాత్మక ప్రాంతం. ఇక్కడ డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లను పెద్ద ఎత్తున చేపట్టాం. వీటికోసం ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నాం”అని ఆయన వివరించారు.