
మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కసారిగా వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దయ్యాయి. మంథని వ్యవసాయ మార్కెట్లో వడ్లు కొట్టుకుపోయాయి.
ముత్తారం మండలం ఖమ్మంపల్లి కొనుగోలు కేంద్రంలో పోసిన వడ్లు కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి 20 రోజులవుతున్నా కాంటాలు వేయడం లేదని, వానలు పడుతుండడంతో నష్టపోతున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.