- భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎంయోగి ఆదిత్యనాథ్
- భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన యోగి
- యోగి వెంట ఆలయానికి బండి సంజయ్, రాజాసింగ్
- సర్వాంగ సుందరంగా ముస్తాబైన భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం
- చార్మినార్ దగ్గర కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాటు
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ లక్ష్మణ్ తో కలిసి భాగ్యలక్ష్మి టెంపుల్కు వెళ్లిన .. యోగి ఆదిత్యనాథ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. యూపీ సీఎం యోగికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. యోగి రాక సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా బీజేపీ నేతలు అలంకరించారు. చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను మోహరించారు. షెడ్యూల్ ప్రకారం శనివారమే అమ్మవారి దర్శనానికి యోగి ఆదిత్యనాథ్ రావాల్సి ఉంది. కానీ సమయం సర్దుబాటు కాకపోవటంతో వాయిదాపడింది.