శ్రీశైలంగౌడ్ను గెలిపించాలి: యోగి ఆదిత్యానాథ్​

శ్రీశైలంగౌడ్ను  గెలిపించాలి: యోగి ఆదిత్యానాథ్​

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్​ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం షాపూర్​నగర్​లో రోడ్​ షో జరిగింది. ముఖ్య అతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్​  హాజరై మాట్లాడుతూ..  హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మారుస్తామని, తెలంగాణకు కేంద్ర బిందువుగా చేస్తామన్నారు.  బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నివర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. 

ఈనెల 30న జరిగే ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థి శ్రీశైలంగౌడ్​ గుర్తు కమలంపై ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుత్బుల్లాపూర్​ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్​ మాట్లాడుతూ.. గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా రౌడీకావాలా?  లేదా ప్రజలకు సేవచేసే వ్యక్తి కావాలో ఆలోచించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ రోడ్​షోలో ఎంపీ లక్ష్మణ్, పార్టీ నేతలు, ​  పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.