- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయితో పట్టుబడిన యూపీ వ్యక్తి
సికింద్రాబాద్,వెలుగు: ఏపీలో గంజాయిని కొనుగోలు చేసి ఢిలీకి తీసుకెళ్లి అమ్ముతున్న వ్యక్తిని సికింద్రాబాద్రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం చెకింగ్ లు చేస్తుండగా ప్లాట్ఫామ్–-1 వద్ద ఓ వ్యక్తి రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు అతడిని తనిఖీ చేయగా 12 కిలోల ఆరు డ్రై గంజాయి ప్యాకెట్లు లభించాయి. అదుపులోకి తీసుకుని విచారించగా యూపీలోని బుదాన్ జిల్లా హసన్ పూర్పరిధి హరియాల్కు చెందిన కృష్ణపాల్సింగ్(22)గా గుర్తించారు. వెల్డర్ పని జేసే అతడు ఈజీ మనీ కోసం గంజాయి అమ్ముతున్నాడు. ఏపీలోని పలాసలో గంజాయిని కొనుగోలు చేసిన కృష్ణపాల్ సింగ్రైలు ఎక్కి సికింద్రాబాద్స్టేషన్లో దిగాడు. ఢిల్లీకి వెళ్లేందుకు తెలంగాణ ఎక్స్ప్రెస్కోసం ఒకటో ప్లాట్ఫామ్పై నిల్చుని ఉండగా పోలీసులు తనిఖీల్లో భాగంగా అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.