ఏపీలో కొని.. ఢిల్లీలో అమ్ముతుండు

ఏపీలో కొని.. ఢిల్లీలో అమ్ముతుండు
  • సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో గంజాయితో పట్టుబడిన యూపీ వ్యక్తి 

సికింద్రాబాద్,వెలుగు:  ఏపీలో గంజాయిని కొనుగోలు చేసి ఢిలీకి తీసుకెళ్లి అమ్ముతున్న వ్యక్తిని సికింద్రాబాద్​రైల్వే పోలీసులు అరెస్ట్​ చేశారు.  సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో శనివారం ఉదయం చెకింగ్ లు చేస్తుండగా ప్లాట్​ఫామ్​–-1 వద్ద ఓ వ్యక్తి రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా  కనిపించాడు. పోలీసులు అతడిని తనిఖీ చేయగా 12 కిలోల ఆరు డ్రై గంజాయి ప్యాకెట్లు లభించాయి. అదుపులోకి తీసుకుని విచారించగా యూపీలోని బుదాన్​ జిల్లా హసన్ పూర్​పరిధి హరియాల్​కు చెందిన కృష్ణపాల్​సింగ్​(22)గా గుర్తించారు.  వెల్డర్ ​పని జేసే అతడు  ​ఈజీ మనీ కోసం గంజాయి అమ్ముతున్నాడు.  ఏపీలోని పలాసలో గంజాయిని కొనుగోలు చేసిన కృష్ణపాల్​ సింగ్​రైలు ఎక్కి సికింద్రాబాద్​స్టేషన్​లో దిగాడు.  ఢిల్లీకి వెళ్లేందుకు  తెలంగాణ ఎక్స్​ప్రెస్​కోసం ఒకటో ప్లాట్​ఫామ్​పై నిల్చుని ఉండగా పోలీసులు తనిఖీల్లో భాగంగా అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.