
వరల్డ్ టెస్ట్ చాంపియప్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ వేదికను ఐసీసీ మార్చలేదు. గత మూడు ఫైనల్స్ను విజయవంతంగా నిర్వహించిన ఇంగ్లండ్కే రాబోయే మూడు మెగా ఫైనల్స్ ఆతిథ్య హక్కులను కేటాయించింది. మూడు నెలల క్రితం ముగిసిన ఏజీఎంలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 2027, 2029, 2031లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరుగుతాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం, టెస్ట్ క్రికెట్పై ఇంగ్లండ్ అభిమానుల ఆసక్తిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇండియాలో ఫైనల్స్ నిర్వహించాలని బీసీసీఐ నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఐసీసీ ఇంగ్లండ్ బోర్డుకే ఓటు వేసింది.
2026 టీ20 వరల్డ్ కప్:
2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ పొట్టి సమరానికి ఇప్పటికే 13 జట్లు నేరుగా అర్హత సాధించగా.. యూరప్ క్వాలిఫైయర్ ద్వారా ఇటలీ, నెదర్లాండ్స్ అర్హత సాధించాయి. దీంతో టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించిన జట్ల సంఖ్య 15 కు చేరింది. మరో 5 జట్లు క్వాలిఫయర్ ద్వారా అర్హత సాధించనున్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్:
2027 వరల్డ్ కప్ లో ఈ సారి మొత్తం 14 జట్లకు ఐసీసీ అవకాశం కల్పించింది. ఈ మెగా టోర్నీ 2003 తరహాలో జరుగుతుందని స్పష్టం చేసింది. మొత్తం 14 జట్లు రెండు గ్రూప్ లుగా విభజించబడతాయి. ఈ మెగా టోర్నీకి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిధ్యమివ్వనున్నాయి. హోస్ట్ కాబట్టి ఈ జట్లు నేరుగా వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి. వీటితో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్-8 లో నిలిచిన జట్లు ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అవుతాయి.
2028 టీ20 వరల్డ్ కప్:
2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2015 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు దేశాలు ఒక ఐసీసీ టోర్నీకి ఆతిధ్యమివ్వడం ఇదే తొలిసారి. పూర్తి వివరాలు ఇంకా ప్రకటించలేదు. కేవలం టోర్నీ ఎక్కడ జరుగుతుందో మాత్రమే ఐసీసీ చెప్పింది.
ఇండియాలోనే 2029 ఛాంపియన్స్ ట్రోఫీ:
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ గెలిచిన టీమిండియాకు మరోసారి గెలుచుకునే అవకాశం లభించనుంది. 2029 లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫికి ఇండియా ఆతిధ్యమివ్వనుంది. 2006లో ఇండియా చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిధ్యమిచ్చింది. 23 ఏళ్ళ తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్ నిర్వహించనుంది.
2030 టీ20 వరల్డ్ కప్:
2030 టీ20 వరల్డ్ కప్ కు ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ సంయుక్తంగా ఆతిధ్యమివ్వనున్నాయి.
2031 వన్డే వరల్డ్ కప్:
ఇండియా, బంగ్లాదేశ్ జట్లు 2031 వన్డే వరల్డ్ కప్ కు ఆతిధ్యమివ్వనున్నాయి. 2011లో చివరిసారిగా ఇండియా, బంగ్లాదేశ్ వన్డే వరల్డ్ కప్ కు హోస్ట్ గా వ్యవహరించాయి. ఇండియా ధోనీ కెప్టెన్సీలోని ఈ వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత 2023 లో ఇండియా మాత్రమే వరల్డ్ కప్ కు హోస్ట్ గా వ్యవహరించింది.