నేటి నుంచి రెప్పపాటులో UPI పేమెంట్స్ పూర్తి..! ఏం మారిందంటే..?

నేటి నుంచి రెప్పపాటులో UPI పేమెంట్స్ పూర్తి..! ఏం మారిందంటే..?

UPI Payments: దేశవ్యాప్తంగా మారుమూల పల్లెలకు సైతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థ విస్తరించిన సంగతి తెలిసిందే. కనీసం పది రూపాయలు ఖర్చు చేయాలన్నా ప్రజలు దానికోసం డిజిటల్ చెల్లింపులను వినియోగిస్తున్నారు. దీంతో రోజురోజుకూ దీని వినియోగం భారీగా పెరిగిపోవటంతో వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

అయితే నేటి నుంచి యూపీఐ చెల్లింపులు గతంలో కంటే వేగంగా పూర్తవుతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీనికి కారణం యూపీఐ వ్యవస్థ కోసం కొత్తగా నిబంధనలను తీసుకురావటమేనని వెల్లడైంది. ఇప్పటి వరకు డబ్బులు పంపటం లేదా పొందటానికి కేవలం 30 సెకన్ల కంటే తక్కువ సమయం పడుతోంది. అయితే కొత్త రూల్స్ కింద ఈ సమయం సగానికి తగ్గిపోనుందని వెల్లడైంది.

ALSO READ | కష్టాల్లో ఇండియన్ ఫ్యామిలీస్.. భారీగా తగ్గిన డబ్బు సేవింగ్, పెరిగిపోయిన అప్పుల భారం..!

ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ నుంచి చెల్లింపులకు కనీసం 15 సెకన్ల లోపే చెల్లింపులను పూర్తి చేయవచ్చని వెల్లడైంది. అలాగే ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ వివరాలను తెలుసుకోవటానికి గతంలో ఉన్న 30 సెకన్ల గడువును ప్రస్తుతం 10 సెకన్లకు తగ్గిస్తున్నట్లు పేమెంట్స్ కార్పొరేషన్ వెల్లడించింది. దీంతో తమ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యిందా లేక ఫెయిల్ అయ్యిందా అనే విషయాన్ని యూజర్లు తక్కువ సమయంలోనే తెలుసుకునేందుకు వీలుంటుంది. 

అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం ద్వారా చేసే చెల్లింపులకు కూడా పట్టే సయాన్ని 15 సెకన్లకు తగ్గినట్లు వెల్లడైంది. గతంలో ఏదైనా పెండింగ్ లేదా మధ్యలో నిలిచిపోయిన ట్రాన్సాక్షన్ గురించి తెలుసుకోవటానికి 90 సెకన్లు వెయిటింగ్ టైమ్ ఉండేది.. అయితే ప్రస్తుతం దానిని 45 నుంచి 60 సెకన్ల మధ్యకు తగ్గించినట్లు తేలింది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయటం ద్వారా చెల్లింపులు ఫెయిల్ అయినా కూడా వెంటనే తెలుసుకోవచ్చు. 

అలాగే యూపీఐ చెల్లింపు వ్యవస్థలపై రద్దీని తగ్గించేందుకు యూపీఐ యూజర్లు తమ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు రోజువారీ పరిమితులను కూడా పేమెంట్స్ కార్పొరేషన్ అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిమితిని రోజుకు కేవలం 3 సార్లకు తగ్గించారు.