
న్యూఢిల్లీ: యూపీఐ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లు సోమవారం నుంచి మరింత వేగంగా జరగనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పేమెంట్స్ కోసం రెస్పాన్స్ టైమ్ను 10 సెకన్లకి తగ్గించాలని బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు ఆదేశాలిచ్చింది. డబ్బు ట్రాన్స్ఫర్, స్టేటస్ చెక్ వంటి ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు 10–-15 సెకన్లలో పూర్తవుతాయని, గతంలో వీటి కోసం 30 సెకన్లు పట్టేదని ఎన్పీసీఐ పేర్కొంది.
జూన్ 16 నుంచి, యూపీఐ పేమెంట్లో అడ్రస్ వ్యాలిడేషన్ సమయం 15 సెకన్ల నుంచి 10 సెకన్లకి తగ్గుతుందని, కస్టమర్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపరచడానికి ఈ రెస్పాన్స్ టైమ్ తగ్గించామని వివరించింది. త్వరలో కస్టమర్లు తమ యూపీఐ యాప్స్ ద్వారా రోజుకు 50 సార్లు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. ప్రస్తుతం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి రోజువారీ లిమిట్ లేదు. కానీ సిస్టమ్ ఎఫిషియెన్సీ, లోడ్ తగ్గించడం కోసం తాజాగా లిమిట్ పెట్టారు. కాగా, ఈ ఏడాది మేలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంఖ్య 1,868 కోట్లకి చేరింది.