
న్యూఢిల్లీ: యూపీఐ ట్రాన్సాక్షన్స్పై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు చేస్తారన్న ఊహాగానాలు, క్లెయిమ్స్ పూర్తిగా తప్పు, ఆధారం లేనివి, తప్పుదోవ పట్టించేవని ఫైనాన్స్ మినిస్ట్రీ బుధవారం స్పష్టం చేసింది. రూ.3 వేల కంటే ఎక్కువ విలువున్న ట్రాన్సాక్షన్లపై ఎండీఆర్ను వసూలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని బుధవారం ఉదయం మీడియా రిపోర్ట్స్ వెలువడ్డాయి. ఇలాంటి ఆధారం లేని, సెన్సేషనల్ ఊహాగానాలు పౌరుల్లో అనవసరమైన అనిశ్చితి, భయం, అనుమానాలను సృష్టిస్తాయని మినిస్ట్రీ పేర్కొంది. డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, యూపీఐపై ఎండీఆర్ను వసూలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కాగా, జనవరి 2020 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్లపై జీరో- ఎండీఆర్ పాలసీని అమలు చేస్తున్నారు.