ఉప్పల్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో పిక్పాకెట్కు పాల్పడుతున్న పలువురిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 1న జనగామ జిల్లాకు చెందిన వ్యాపారి సేన రామ్ సికింద్రాబాద్ నుంచి ఆభరణాలు, నగలు తీసుకుని ఆర్టీసీ బస్సులో బయల్దేరి ఉప్పల్లో దిగాడు. బ్యాగులో ఆభరణాలు కనిపించకపోవడంతో ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్కు చెందిన దాసర్ల యాదగిరి(24), కొమ్ము ప్రశాంత్(25), పాసం యాదగిరి(23), బండారి సాంబరాజు(25), మబ్బు రాజు(25) చోరీలు చేస్తున్నట్లుగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసి 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు.
