
రిషబ్ పంత్ కారు ప్రమాదంపై బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా స్పందించింది. ఇన్ స్టాలో క్రిప్టిక్ పోస్టుతో పంత్ కోలుకోవాలని ప్రార్థించింది. దేవకన్య గెటప్లో హాట్గా చూస్తున్న ఫోటోను పోస్టు చేసిన ఊర్వశి...ప్రార్థిస్తున్నా అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఫ్యాన్స్ ఫైర్..
ఊర్వశి రౌటేలా పోస్టుపై పంత్ అభిమానులు మండిపడుతున్నారు. రిషబ్ పంత్ గురించి ఊర్వశి నిజంగానే బాధపడుతుంటే.. అతని ఫోటో పెట్టి.. ఇలాంటి కాప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. ఆపద సమయంలో పంత్ బాగుండాలని కోరుకుంటుందనే సానుభూతి అయినా ఆమెకు దక్కి ఉండేదని కామెంట్ చేస్తున్నారు.
టాలీవుడ్లో బిజీ..
ఊర్వశి రౌటేలా ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ అయింది. శ్రీను దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమాలో ఆమె స్పెషల్ రోల్ చేస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఆమె మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది.