అమెరికా రాయబారి సెర్గియో గోర్ సోమవారం చారిత్రక చార్మినార్ను సందర్శించారు. ఈ సందర్భంగా చార్మినార్ పైకి ఎక్కి పాతబస్తీ అందాలను వీక్షించారు. ఇరానీ ఛాయ్రుచి చూసి బాగుందని కితాబునిచ్చారు. అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతూ పురాతన నగరం దూసుకుపోతోందని ప్రశంసించారు. తర్వాత రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల ఏరోస్పేస్, డిఫెన్స్మ్యానుఫాక్చరింగ్సెంటర్ను విజిట్చేశారు.
చార్మినార్/ఇబ్రహీంపట్నం, వెలుగు
