భారత్ కు చేరుకున్న డొనాల్డ్ ట్రంప్

భారత్ కు చేరుకున్న డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు వచ్చిన ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ తో పాటు కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ వచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి భారీ భద్రత మధ్య సబర్మతి ఆశ్రమానికి బయలు దేరారు. ఆ తర్వాత అక్కడి నుంచి మోతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.