
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)పై అమెరికా ప్రె సిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. సంస్థకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టారు. సంస్థకు తామే ఎక్కువ నిధులిస్తున్నా, చైనా చెప్పేమాటల్నే డబ్ల్యూహెచ్ఓ వింటోందని, ఆ దేశానికి అనుకూలంగా పనిచే స్తోందని మండిపడ్డారు. చైనాలో కరోనా కేసులు, మర ణాలను కప్పిపుచ్చిందని, కరోనా సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కోలేదని ఆయన ఆరోపించా రు. ‘‘డబ్ల్యూహెచ్ఓ కు నిధులు ఆపేయాల్సిందిగా అధికారులకు ఆదే శాలిచ్చాం. కరోనా లెక్కలను దాచిపెట్టడంలో డబ్ల్యూహెచ్ఓ పాత్రను సమీక్షిస్తున్నాం. అక్కడ (చైనాలో) ఏం జరిగిందో అందరికీ బాగా తెలుసు’’ అని ఆయన అన్నారు. చైనాపై డబ్ల్యూహెచ్ఓ తీసుకున్న నిర్ణయాల వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిందన్నారు. సైంటిస్టులను ఎందుకు పంపలేదు? వైరస్ ప్రభావం ఉందని తెలియగానే పరిస్థితి ని అంచనా వేసేందుకు అక్కడకు సైంటి స్టులు, రీసెర్చ ర్లు, డాకర్టను ఎందుకు పంపలేదని ట్రంప్ ప్రశ్నిం చారు. కేసుల విషయంలో చైనా పారదర్శకతను తెలుసుకోవడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందన్నారు. ముందే దాని లె క్క తేలిస్తే ఇన్ని మరణాలు ఉండేవి కాదన్నారు. చైనా అడుగులకు మడుగులొత్తిందని మండిపడ్డారు. ట్రావెల్ బ్యాన్ అవసరం లేదంటూ చెప్పుకొచ్చిందన్నారు. చైనా ముందుగానే అన్నింటినీ మూసేయకపోవడం వల్లే కేసులు 20 రెట్లు ఎక్కువ య్యాయన్నా రు. డబ్ల్యూహెచ్ఓ మాటలు విని చైనాకు గేట్లు బార్లా తెరవడం వల్లే యూరప్లో కేసులు ఎక్కువై ప్రపంచం మొత్తానికి వైరస్ వ్యాపించిందన్నారు. మంచి సంస్కరణలు చేస్తే డబ్ల్యూహెచ్ఓ కలిసి పనిచేస్తామని, ప్రస్తుతం సంక్షోభంపై వేరే సంస్థలతో కలిసి పోరాడతామని ట్రంప్ తేల్చి చెప్పారు.
పైసలు ఎక్కువిచ్చేది మేమే
డబ్ల్యూహెచ్ఓ కు ఎక్కువ నిధులు ఇచ్చేది అమెరికాయేనని ట్రంప్ అన్నా రు. ఏటా 40 కోట్ల డాలర్ల (సుమారు రూ.3,066 కోట్లు) నుంచి 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.3,832 కోట్లు) వరకు నిధులిస్తున్నా మన్నారు. చైనా మాత్రం జస్ట్ 4 కోట్ల డాలర్లు (రూ.306 కోట్లు) ఇస్తోందన్నారు. సంస్థకు ఎక్కువ నిధులు ఇస్తున్న దేశంగా డబ్ల్యూహెచ్ఓ తప్పుడునిరయాలను ఎండగ గట్టే హక్కు, బాధ్యతగా పనిచేయాలని చెప్పే హక్కు తమకుందని అన్నా రు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న చైనా, ఇతర దేశాల నుంచి ప్రయాణాలను నిషేధించాలన్న తమ నిర్ణయాలను డబ్ల్యూహెచ్ఓ వ్యతి రేకించిం దని, చైనాకు మద్దతుగా నిలిచిందని అన్నారు. అదృష్టవశాత్తూ తాము సంస్థ మాటలు వినలేదన్నారు. డబ్ల్యూహెచ్ఓ చెప్పినట్టు చేస్తేకేసులు, మరణాల సంఖ్య ఊహకు కూడా అందేది కాదన్నారు. ప్రపంచానికి పొంచి ఉన్న జబ్బుల ముప్పును టైంకు వెల్లడించాల్సి ఉంటుందని, దానికి అన్ని దేశాలూ డబ్ల్యూహెచ్ఓ పైనే ఆధారపడతాయని అన్నా రు. కానీ, ఆ డ్యూటీలో డబ్ల్యూహెచ్ఓ ఫెయిలైందని మండిపడ్డారు.
చెప్పినా పట్టించుకోలే
వుహాన్లోమొదలైన వైరస్ గురించి అక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు ముందేచెప్పినా డబ్ల్యూహెచ్ఓ పట్టించుకోలేదని ట్రంప్ ఆరోపించారు.చైనాప్రభుత్వం చెప్పిన లెక్కలను పట్టుకునే వేలాడిందన్నారు. ఒకరి నుంచిఒకరికి కరోనా సోకుతోందని డిసెంబర్ లోనే నివేదిక ఇచ్చినా అస్సలు పట్టించుకోలేదని,పైగా జనవరిలోఅసలు మనిషి నుంచిమనిషికి వైరస్ సోకట్లేదంటూ ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ ఎమెర్జెన్సీని ప్రకటించకుండా లేట్ చేసిందని,ఆ ఆలస్యమే ఇప్పుడుఅందరి కొంప ముంచిందని మండిపడ్డా రు. వైరస్ శాంపిళ్లను ఆలస్యంగా సేకరించడం వల్ల సైంటిస్టులకుఅవసరమైన సమాచారం అందలేదన్నారు. కేసులు,మరణాల గురించి అన్నీ తప్పుగా వెల్లడించారని ట్రంప్ తెలిపారు.
ఇప్పుడే డబ్ల్యూహెచ్ఓ అవసరం
ఇలాంటి సంక్షోభ సమయంలో డబ్ల్యూహెచ్ఓకు నిధులు ఆపేయడం చాలా ప్రమాదకరమని మై క్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నా రు. డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న పనుల వల్లే ప్రపంచంలో కరోనా కట్టడవుతోందన్నారు. వాళ్లపనని అడ్డుకుంటే, మరే సంస్థ కూడా అంత బాగా పనిచేయలే దన్నారు. మునుపెన్నడూ లేనంతగా ప్రపంచానికి ఇప్పుడే డబ్ల్యూహెచ్ఓ చాలా అవసరమన్నా రు.
ఇది కరెక్ట్ టైం కాదు
యూఎన్ డబ్ల్యూహెచ్ఓ కు నిధులు ఆపేయడానికి ఇది కరెక్ట్ టైమ్ కాదని ఐక్యరాజ్యసమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నా రు. కరోనా వైరస్తో పోరాడడానికి, దాని వల్ల వచ్చిన సమస్యలను సరిదిద్దడానికి ప్రపంచం మొత్తం కలిసి పనిచేయాల్సిన టైం ఇది అని అన్నా రు. కరోనాపై యుద్ధంలో గెలిచేందుకు డబ్ల్యూహెచ్ఓ ప్రయత్నా లు కీలకమని, కచ్చితంగా సంస్థకు అందరూసహ కరించాలని ఆయన పిలుపునిచ్చారు. నిజాలను ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకోవడంలో తప్పు లేదని, కానీ, డబ్ల్యూహెచ్ఓ ను తప్పుబట్టడం కరెక్ట్ కాదని అన్నారు. మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కరోనా నుంచి ఓ పాఠం నేర్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
మేమిస్తం ఎక్కువ పైసలు: చైనా
ట్రంప్ నిర్ణయంపై చైనా మండిపడింది. నిధులు ఆపేయడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ కు తాము ఇచ్చే నిధులను పెంచు తామని చెప్పింది. ‘‘ప్రపంచ ఆరోగ్య భద్రత విషయంలో ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అది. ఇలాంటి ఆరోగ్య సంక్షోభాలు ఎదురైనప్పు డు ముందుండి నడిపిస్తున్న డబ్ల్యూహెచ్ఓ పాత్ర ఎనలేనిది. ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్య లను కో ఆర్డినేర్డి ట్ చేయడంలో సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియేసస్ కీలక పాత్రపోషిస్తున్నా రు. ఇలాంటి టైంలో అమెరికా నిర్ణయం వల్ల డబ్ల్యూహెచ్ఓ నీరుగారిపోయే అవకాశాలున్నాయి. దాని వల్ల అమెరికా సహాప్రపంచ దేశాలన్నింటికీ నష్టం’’ అని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఈయూ, జర్మనీ మండిపాటు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ), జర్మనీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి టైంలో విభజించి మాట్లాడడం తగదని, అందరూ కలిసి పనిచేసేలా ఐక్యతను చాటిచెప్పాల్సి న అవసరం ఉందని ఈయూ ఫారిన్పాలసీ చీఫ్ జోసెప్ బోరెల్ అన్నా రు. అందరూ కలిసి పనిచేస్తేనే కరోనాను అంతం చేయగలమన్నారు. ఎదుటోళ్లపై బురద జల్లడం వల్ల ఒరిగేదేం లేదని జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యూఎన్, డబ్ల్యూహెచ్ఓ కు అండగా ఉండాల్సి న అవసరం ఉందన్నారు. టెస్టులు, వ్యాక్సి న్ల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలన్నా రు. మరింతగా ఆ సంస్థ లకు అండగా నిలబడాలన్నా రు.