అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్​ కరోనా

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్​ కరోనా

న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్​ కరోనా బారిన పడ్డారు. ఆయనకు తేలికపాటి లక్షణాలున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైట్​హౌస్​లోనే ఐసోలేషన్ లో ఉన్నారని, అక్కడి నుంచే ఆన్​లైన్​ ద్వారా సమావేశాల్లో పాల్గొంటారని, ఆదేశాలిస్తారని తెలిపారు. బైడెన్ ప్రస్తుతం యాంటీవైరల్ డ్రగ్ తీసుకుంటున్నారని చెప్పారు. కాగా, కరోనా నుంచి సేఫ్టీ కోసం ఇప్పటికే ప్రెసిడెంట్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మధ్యే బూస్టర్ డోసు కూడా వేయించుకున్నారు.