ఎంత పని చేశావ్ ట్రంప్ మావా: ఫ్రెండ్ అంటూనే భారత్‌పై టారిఫ్బాంబ్

ఎంత పని చేశావ్ ట్రంప్ మావా: ఫ్రెండ్ అంటూనే భారత్‌పై టారిఫ్బాంబ్

న్యూయార్క్: భారత్‌పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్​టారిఫ్ బాంబు పేల్చారు. ఇండియా తమకు మిత్ర దేశమని అంటూనే ఇండియా వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​‘ట్రూత్’ వేదికగా ట్రంప్​ బుధవారం ఈ ప్రకటన చేశారు.

రష్యా నుంచి భారత్​భారీగా రక్షణ ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అందుకే భారత్‌‌‌‌‌‌‌‌పై టారిఫ్‌‌‌‌‌‌‌‌లతోపాటు అదనంగా పెనాల్టీ విధిస్తున్నట్టు చెప్పారు.

భారత్​ మిత్ర దేశమే కానీ.. 

భారత్​తమకు మిత్రదేశమని, అయినప్పటికీ ఆ దేశంతో తక్కువ వ్యాపారమే చేస్తున్నామని ట్రంప్​వ్యాఖ్యానించారు.  ‘‘భారత్ మా మిత్ర దేశమే. కానీ ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌‌‌‌‌‌‌‌లు విధిస్తున్న దేశాల్లో ఒకటి. అత్యధిక దిగుమతి టారిఫ్‌‌‌‌‌‌‌‌లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయి. అందుకే ఆ దేశంతో పరిమితంగా బిజినెస్ డీల్​పెట్టుకున్నాం” అని అన్నారు. భారత్‌‌‌‌‌‌‌‌తో భారీగా వాణిజ్యలోటు ఉన్నదని మరో పోస్ట్‌‌‌‌‌‌‌‌లో వెల్లడించారు.  

కాగా, ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో భారతీయ వస్తువులపై ట్రంప్​ 27% వరకు టారిఫ్‌‌‌‌‌‌‌‌లను ప్రకటించారు. అయితే, ఆ నిర్ణయాన్ని తర్వాత నిలిపివేశారు. అప్పటినుంచి ఇరు దేశాలు ట్రేడ్​డీల్​కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. భారత్‌‌‌‌‌‌‌‌పై 20–25 శాతం సుంకం విధిస్తామంటూ ట్రంప్​ పదే పదే చెబుతున్నారు. మంగళవారం కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు కానీ.. ఎలాంటి తేదీలు ప్రకటించలేదు. బుధవారం అకస్మాత్తుగా భారత్​దిగుమతులపై టారిఫ్‌‌‌‌‌‌‌‌లు విధిస్తున్నట్టు వెల్లడించారు.