వాషింగ్టన్: గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన పీస్ బోర్డులో చేరాలని కెనడాకు పంపిన ఆహ్వానాన్ని అమెరికా వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో వెల్లడించారు.
‘‘డియర్ కెనడా ప్రధాని కార్నీ.. పీస్ బోర్డులో చేరాలని మీకు ఇంతకుముందు పంపిన ఆహ్వానాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం” అని ట్రంప్ ప్రకటించారు. అంతకు ముందు దావోస్లో తమ వల్లే కెనడా బతుకుతోందని ట్రంప్ చెప్పారు. దీనికి కెనడా ప్రధాని మార్క్ కార్నీ అక్కడే కౌంటర్ ఇచ్చారు.
