వాషింగ్టన్: ఇరాన్లో అధికార మార్పు జరిగితే మంచిదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు దిగుతుందన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం పెరిగింది.
ట్రంప్ ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్ను నార్త్ కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్ దిశగా పంపుతున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకగా పేరున్న యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్. పోర్డ్కూడా కరేబియన్ ప్రాంతం నుంచి బయలుదేరింది.
ఇటీవల రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరగొచ్చని సంకేతాలిచ్చిన ట్రంప్.. ఇప్పుడు మాట మార్చడంతో రెండు దేశాల మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.
