విభజించి మోడీ.. మోసాలతో కేసీఆర్ పాలిస్తున్రు

విభజించి మోడీ.. మోసాలతో కేసీఆర్ పాలిస్తున్రు

అటు మోడీ, ఇటు కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందని.. రాజకీయంగా నష్టపోయినా సోనియా తెలంగాణ ఇచ్చిందన్నారు. మతపరంగా విభజించి మోడీ, మోసాలతో కేసీఆర్ పాలిస్తున్నారన్నారు. అన్ని రకాలుగా మోసం చేసిన కేసిఆర్, ఇప్పుడు దళిత బంధు అంటూ మోసం చేస్తున్నాడన్నారు.  దళితబంధుకు లక్షా 70 వేల కోట్లు కావాలి.. కానీ కేసీఆర్  రూ. 25 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో ఎందుకు పెట్టారో  చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఏక కాలంలో రుణమాఫీ చేస్తే..  టీఆర్ఎస్  నాలుగు విడతల్లో రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్నారు ఉత్తమ్. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి 100 కోట్లు ఖర్చుపెట్టిన రియల్ వ్యాపారిని ఓడించి తనను  గెలిపించారన్నారు. ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందన్నారు.