50 మంది ప్రయాణికులతో లోయలో పడ్డ బస్సు

50 మంది ప్రయాణికులతో లోయలో పడ్డ బస్సు

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 50 మందితో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. పౌరీ గర్వాల్ జిల్లా సిండి గ్రామ శివారులోని రిఖ్నిఖాల్, బీరో ఖాల్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించారు. 

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ‘‘ఈ ప్రమాద ఘటన దురదృష్టకరం. దీనిపై విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడాను. తక్షణ సహాయక చర్యలను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటాం’’ అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు.