స్పెషల్ డ్రైవ్ తో బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్

స్పెషల్ డ్రైవ్ తో బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్

సీఎ కేసీఆర్ ఆదేశాలతో.. రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. వ్యాక్సినేషన్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సోమేశ్ కుమార్.. శనివారం వివిధ బ్యాంకుల ప్రతినిధులతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్ పై BRK భవన్ లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని.. అక్టోబర్ చివరి నాటికి ఆ ప్రక్రియను పూర్తి  చేసేందుకు  ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

మొదటి దశలో హై ఎక్స్ పోజర్ గ్రూప్స్ కు వ్యాక్సిన్ అందించామని.. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న వారికి దశల వారీగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టామన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ద్వారా అధిక మొత్తంలో వ్యాక్సిన్ డోస్ లను పొందేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమంపై..కార్మిక శాఖ అధికారులుతో సమావేశమయ్యారు సీఎస్ సోమేశ్ కుమార్. కార్మికుల సంక్షేమ కార్యక్రమాల అమలుకు నోడల్ అధికారిని నియమించుకొని.. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 10 రోజుల్లోగా వలస కార్మికుల డేటాను సేకరించాలని అధికారులను ఆదేశించారు.