వ్యాక్సిన్ తీసుకోవడానికి జనాల్లో పెరుగుతున్న ఆసక్తి

వ్యాక్సిన్ తీసుకోవడానికి జనాల్లో పెరుగుతున్న ఆసక్తి

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి దేశంలో చాలా మంది ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ప్రస్తుతం దేశ ప్రజల్లో టీకా తీసుకోవడంపై సుమఖత పెరుగుతోంది. జాతీయ వ్యాప్తంగా జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వెంటనే వ్యాక్సిన్ తీసుకోవడానికి దేశం మొత్తంలో 42 శాతం మంది సిద్ధంగా ఉన్నారని సర్వే తెలిపింది.

ఒక్క నెల వ్యవధిలో వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్న వారి సంఖ్య 31 నుంచి 42 శాతానికి పెరగడం విశేషం. సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌ వేదికగా చేసిన ఈ సర్వేలో 289 జిల్లాలకు చెందిన నెటిజన్స్ నుంచి 25 వేల రెస్పాన్స్‌‌లు వచ్చాయి. దీని ప్రకారం వ్యాక్సిన్‌‌పై అనుమానాలు వ్యక్తం చేసిన లేదా వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడిన వారి సంఖ్య 16 శాతం తగ్గింది. అయినప్పటికీ 58 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దేశంలో ఇప్పటికే 5 మిలియన్ల మంది హెల్త్‌‌కేర్ వర్కర్స్ వ్యాక్సినేషన్ చేయించుకున్నారు.