వనస్థలిపురం ఘటనలో గుడిసే కాలలే.. కాల్చిండ్రు

వనస్థలిపురం ఘటనలో గుడిసే కాలలే.. కాల్చిండ్రు

గత నెల 26న జరిగిన ఘటనలో పోలీసుల పురోగతి

ఎల్బీ నగర్,వెలుగు: గత నెల 26న వనస్థలిపురంలోని ఎస్.కె.డి నగర్‌లో అనుమానాస్పద స్థితిలో గుడిసెకు నిప్పంటుకొని వ్యక్తి సజీవ దహనమైన ఘటనను పొలీసులు హత్యగా తేల్చారు. సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరికి చెందిన రమేష్ సిటీకి వచ్చి వనస్థలిపురం ఎస్.కె.డి నగర్‌లోని ఓ ఖాళీ స్థలంలో గుడిసె వేసుకొని ఉండేవాడు. గత నెల 26న తెల్లవారు జామున గుడిసెకు నిప్పం టుకొని పూర్తిగా దగ్ధమైంది. లోపల ఉన్న రమేశ్ సజీవ దహనం అయ్యాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆదారంగా రమేష్ గుడిసెకు ఎవరో కావాలని నిప్పుపెట్టినట్టు గుర్తించారు. తెలిసిన వ్యక్తే ఈ పని చేసినట్టు భావిస్తున్నారు.