వందే భారత్ రైలుపై రాళ్ళ దాడి

వందే భారత్ రైలుపై రాళ్ళ దాడి

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న వందే భారత్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్ళ దాడి చేశారు. ఈ -ఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలో జరిగింద. మహబూబాబాద్ - గుండ్రాతి మడుగు స్టేషన్ ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. దీంతో రైలు -కోచ్ 4, కోచ్ 8 బయటి గ్లాస్ కు పగుళ్ళు పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు -మహబూబూబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు.