
నటి వనిత విజయ్ కుమార్ జీవితంలో మరో విషాధం చోటు చేసుకుంది. ఆమె మూడో భర్త పీటర్ పాల్ మృతిచెందాడు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. భర్త మృతిపట్ల వనిత విజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేసింది.
ఈమేరకు పోస్ట్ పెట్టిన ఆమె.. "మీరు ఎదుర్కొన్న చెడ్డ వ్యక్తులు, ఆ గాయాలతో మీరు చేసిన పోరాటం నాకు తెలుసు. ఈ ప్రపంచంలో నుండి మీరు వెళ్లిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ మీరు ఎక్కడున్నా ఓ మంచి స్థానంలోనే ఉన్నారని నాకు తెలుసు, అక్కడైనా సంతోషంగా ఉండండి" అంటూ పోస్ట్ పెట్టింది.
ఇక 2020 జూన్ లో పెళ్లి చేసుకున్న వనిత విజయ్ కుమార్, పీటర్ పాల్ జంట కొన్ని అనుకోని కారణాలవల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇక పీటర్ కి ఉన్న తాగుడు అలవాటు వల్లనే అతని ఆరోగ్యం క్షీణించిందని చెబుతారు తెలిసినవాళ్లు. దీని కారణంగానే కొన్ని రోజుల కిందట అతడికి హార్ట్ ఎటాక్ కూడా వచ్చిందట. దీంతో.. వెంటనే అతడిని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఇక అప్పటినుండి హాస్పిటల్ లోనే ఉంటున్న పీటర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.