నిర్మాతల కోసం వరుణ్ గ్రేట్ డెసిషన్.. ఫిదా అవుతున్న నెటిజన్స్

నిర్మాతల కోసం వరుణ్ గ్రేట్ డెసిషన్.. ఫిదా అవుతున్న నెటిజన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej) లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Pravin sttaru) తెరకెక్కించిన ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఏ సినిమా ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఈ సినిమా వరుణ్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. 

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్సెన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రూ.18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది కానీ.. మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో బ్రేక్ ఈవెన్ అవడం కూడా కష్టంగా మారింది. దీనివల్ల నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లింది. ఇక వరుణ్ తేజ్ గత సినిమా గని కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. గని సినిమాకు కూడా నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చాయి. 

అయితే ఈ రెండు సినిమాల నిర్మాతల విషయంలో వరుణ్ తేజ్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే.. ఈ ఇద్దరు నిర్మాతలతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట వరుణ్. అది కూడా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా. తన వల్ల నష్టాలు వచ్చిన నిర్మాతలకు తానే న్యాయం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాడట వరుణ్. వరుణ్ ప్రస్తుతం మిషన్ వాలెంటైన్, మట్కా అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత ఆ ఇద్దరు నిర్మాతలతో సినిమాలు చేయనున్నాడు వరుణ్. ఇక వరుణ్ చేస్తున్న ఈ పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నష్టపోయిన నిర్మాతల గురించి నీలా అందరు ఆలోచిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది వరుణ్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.