'వీరసింహారెడ్డి' ట్రైలర్ రిలీజ్

'వీరసింహారెడ్డి' ట్రైలర్ రిలీజ్

నట సింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం 'వీరసింహా రెడ్డి'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇవాళ 'ఒంగోలు'లో నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర బృందం ట్రైలర్ వదిలారు.

"సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తి పట్టా".. అనే డైలాగ్ ట్రైలర్ మొదలౌతుంది.  ఇందులో బాలయ్య యాక్షన్, డైలాగులు అదిరిపోయాయి. ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం మాస్ జాతరే అన్నట్లుగా ఉంది. ఈ ట్రైలర్ ను డైరెక్టర్ బి గోపాల్ రిలీజ్ చేశారు. 

ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రుతి హాసన్ హీరోయిన్ ‌‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ ‌‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ లో మూవీ సాగనున్నట్లు తెలస్తోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.