జంతర్​ మంతర్​ వద్ద వీరశైవ లింగాయత్​ల ఆందోళన

జంతర్​ మంతర్​ వద్ద వీరశైవ లింగాయత్​ల ఆందోళన

ఢిల్లీ: తమ వర్గాన్ని జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ వీరశైవ లింగాయత్​లు ఢిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద ఆందోళన చేపట్టారు. నేషనల్ బీసీ కమిషన్‌ను కలిసి గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. 

ఈ ధర్నాలో మాజీ ఎంపీలు సురేశ్ షెట్కర్, పొన్నం ప్రభాకర్, రాపోలు ఆనంద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య, బీఆర్​ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, వీరశైవ లింగాయత్ నేతలు, బీసీ సంక్షేమ సంఘం నేతలు కూడా పాల్గొని తమ మద్దతు తెలిపారు.