టీడీపీకి షాక్: వైసీపీలోకి కడప జిల్లా సీనియర్ నేత..

టీడీపీకి షాక్: వైసీపీలోకి కడప జిల్లా సీనియర్ నేత..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించటంతో నేతలంతా ప్రచారం ముమ్మరం చేసిన నేపథ్యంలో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. మరో పక్క ఎన్నికల్లో సీటు ఆశించి దక్కని నేతలంతా పార్టీ ఫిరాయింపులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. కడప జిల్లా సీనియర్ నాయకుడు వీరశివారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు.

ఈ ఎన్నికల్లో కమలాపురం నుండి టికెట్ ఆశించగా మొండి చెయ్యి చూపింది పార్టీ అధిష్టానం. పైగా వీరశివారెడ్డి సోదరుడి కుమారుడు ప్రవీణ్ రెడ్డికి కూడా ప్రొద్దుటూరు టికెట్ ఇవ్వకపోవటంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు వీరశివారెడ్డితో సంప్రదింపులు జరిపారని, ఈ వారంలోనే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి, వీరశివారెడ్డి వైసీపీలో చేరటం కడప జిల్లా టీడీపీని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.