నయాగరా వద్ద పేలిన వాహనం .. టెర్రర్​ అటాక్​ కాదన్న అధికారులు

నయాగరా వద్ద పేలిన వాహనం .. టెర్రర్​ అటాక్​ కాదన్న అధికారులు

నయాగరా: కెనడాలోని నయాగరా జలపాతం రెయిన్​బో బార్డర్ ​బ్రిడ్జి వద్ద ఓ వాహనం పేలడం కలకలం సృష్టించింది. అమెరికా వైపు నుంచి -కెనడా వంతెన వైపు బుధవారం వేగంగా వెళుతున్న ఓ వాహనం చెక్ ​పాయింట్ ​వద్ద ఢీకొని పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

పేలుడు అనుమానాస్పదంగా ఉండటంతో అలర్ట్​ అయిన అధికారులు.. క్రాసింగ్‌ బార్డర్లను మూసివేశారు. ఈ విధ్వంసానికి గల కారణమేమిటో ఇంకా తేలలేదు. కాగా, టెర్రర్​అటాక్​కు సంబంధించిన సంకేతాలు ఏమీ కనిపించడం లేదని చెప్పిన అధికారులు, ఘటనపై విచారణ చేపడుతున్నారు.

Also Read :- ఏఐ రెగ్యులేషన్​కి సెబీ తరహా మోడల్ ఉండాలి : సంజీవ్​ సన్యాల్